ఊర్వశి రౌతేలా ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉండే యాక్టర్ ఈ బ్యూటీ. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశికి తెలుగులో మాత్రం ఇప్పటివరకు హీరోయిన్గా అవకాశాలు రాలేదు. కానీ వాల్తేరు వీరయ్య, బ్రో, స్కంద, ఏజెంట్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది. తాను నటించిన పాటలన్నీ సూపర్ హిట్ అవడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక ఈ బ్యూటీకి హిందీలో నటుడు సన్నీ దేవోల్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చిందట. కానీ అతని వయసు చాలా ఎక్కువగా ఉండడంతో ఈ విషయం తెలిసిన వారంతా తండ్రి వయసు ఉన్న వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అస్సలు బాగుండదని ఎగతాళి చేశారట. కానీ ఊర్వశికి మాత్రం తనకు అవకాశం వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయిందట. అప్పటినుంచి వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన నటనను ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉందట.


కొంతమంది సన్ని డియోల్ కు ఉన్న పిల్లల కన్నా ఊర్వశి వయసు చాలా తక్కువగా ఉంటుందని కామెంట్లు చేశారట. ఆ కామెంట్లు చూసి ఊర్వశి అస్సలు బాధపడలేదట. నిజ జీవితంలో అలాంటి పనులు చేస్తే బాధపడాలని ఊర్వశి అన్నారు. స్క్రీన్ మీద తనకన్నా పెద్దవారితో నటించడం పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఊర్వశి వెల్లడించారు. ఎలాంటి సీన్లలోనైనా నటించడానికి నేను అస్సలు వెనకాడను అంటూ ఊర్వశి తాజాగా వెల్లడించినట్లు సమాచారం అందుతోంది. కాగా, మెగాస్టార్ చిరంజీవి పక్కన వేర్ ఇస్ ది పార్టీ బాసు అంటూ ఊర్వశి ఓ ఊపు ఊపేసింది. ఇక ఇటీవలే NBK 109 సినిమాలోను హీరోయిన్గా ఊర్వసి ఛాన్స్ కొట్టేసింది.

బాలకృష్ణ-బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఊర్వశి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించినట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాలో ఊర్వశి తన నటనను నిరూపించుకోవడానికి అద్భుతంగా నటించిందని ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాల అనంతరం ఊర్వశికి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావాలని తన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: