డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మూవీ ఎలా సెట్ అయ్యింది. ఆ సినిమాను సెట్ చేయడంలో ఎవరు సహకరించారు అనే విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను.

ఒకానొక సమయంలో నాకు దర్శకుడు హరీష్ శంకర్ తమిళంలో అజిత్ "పింక్" సినిమాకు రీమేక్ గా రూపొందిన నార్కొండ పార్వై అనే మూవీ లో హీరో గా నటించాడు. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నాకు హరీష్ శంకర్ ఒక రోజు చూపించి ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తే అదిరిపోతుంది అని చెప్పాడు. నాకు కూడా ఆ ఐడియా బాగా నచ్చింది. ఇక ఆ తర్వాత ఒక రోజు త్రివిక్రమ్ గారిని కలిసాను. ఈ సినిమా ట్రైలర్ ను చూపించాను. ఆ ట్రైలర్ చూసి బాగుంది అన్నారు.

ఇక ఆ తర్వాత ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో రీమిక్ చెయ్యాలి అని అనుకుంటున్నాను అని చెప్పాను. ఓకే అన్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు ఆ సినిమా చూపించాడు. ఇక ఆ తర్వాత నన్ను పవన్ పిలిచారు. దర్శకుడిగా ఎవరిని అనుకుంటున్నావు అన్నాడు. వేణు శ్రీరామ్ అని చెప్పాను. దానితో వెంటనే పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమా సెట్ అయింది. హరీష్ శంకర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకపోయి ఉంటే ఆ సినిమా సెట్ అయ్యేది కాదు అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: