మన తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ దర్శకులుగా పేరు తెచ్చుకున్న వారిలో రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ ముగ్గురు టాప్ ప్లేస్ లో ఉన్నారు. రాజమౌళి బాహుబలి సినిమాలతో  తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకువెళ్లాడు. అలాగే ఆ తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో టాలీవుడ్‌ను ప్రపంచ సినిమాల స్థాయికి తీసుకువెళ్లాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేసే సినిమాని హాలీవుడ్ సినిమాలుకు పోటీగా తీయబోతున్నాడు.  మరో దర్శకుడు సుకుమార్ కూడా అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తీసి పాన్ ఇండియా దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో  అల్లు అర్జున్ ను  పాన్ ఇండియా హీరోగా మార్చాడు. ప్రస్తుతం పుష్ప 2  సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్లో పుష్ప2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


ఇక మరి మరోదర్శకుడు త్రివిక్రమ్ మాత్రం ఇప్పటికీ పాన్ ఇండియా సినిమా చేయలేదు. గత సంక్రాంతికి మహేష్ తో  గుంటూరు కారం తీసి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి తన తర్వాతి సినిమాను ఎవరితోనూ ప్రకటించలేదు. మధ్యలో ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని ట‌క్‌ వచ్చిన అది అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు త్రివిక్రమ్ తన తర్వాత సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వరకు త్రివిక్రమ్ ఇప్పటికే మొదలుపెట్టాడట.


సినిమా స్టోరీ కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. జనవరిలో ఓ స్పెషల్‌ ప్రోమోతో సినిమాను ప్రకటిస్తార‌ట‌. మార్చి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని ఓ కొత్త కథతో వ‌స్తున్న‌ర‌ట‌. ముఖ్యంగా ఈ సినిమాతో త్రివిక్రమ్ రాజమౌళిని టార్గెట్ చేయనున్నారట.. ఆయన ఇప్పటివరకు టచ్ చేయని జోనర్ను ఆయన కథగా ఎంచుకున్నారట.. ఈ సినిమాలో విజువల్స్ , గ్రాఫిక్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. మరి త్రివిక్రమ్ అల్లు అర్జున్ పెట్టుకుని రాజమౌళికే సవాల్ విస్రబోతున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: