తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కచ్చితంగా సక్సెస్ అందుకోవాలి. కొన్ని రోజులు సక్సెస్ అందుకొని ఆ తర్వాత ఫెయిల్ అయితే... అలాంటి వారిని ఎవరు పట్టించుకోరు. ఆస్థానంలో హీరో ఉన్నా... హీరోయిన్ లేదా దర్శకుడు.. ఇలా ఎవరు ఉన్నా కూడా... వారిని ఎవరు పట్టించుకోరు. ప్రతిసారి.. హిట్ కొట్టాల్సిందే అన్నట్లుగా తెలుగు ప్రేక్షకులు చూస్తారు. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు... అప్పట్లో బాగా హిట్లు కొట్టి... ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

 

అలాంటి దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలో... కామెడీ అదిరిపోతుంది.  ఎంత పెద్ద హీరో అయినా సరే... శ్రీను వైట్లతో సినిమా చేశాడంటే కచ్చితంగా కామెడీ పండించాల్సిందే. ఆయన కథలు అలా ఉండేవి. శ్రీను వైట్ల కెరీర్ లో... సొంతం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, దూకుడు లాంటి సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి.

 

వస్తావంగా 1999 సంవత్సరంలో... నీకోసం అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు శ్రీనువైట్ల. ఈ సినిమాలో రవితేజ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత... టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు దర్శకుడు శ్రీనువైట్ల. రవితేజ, కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ లాంటి  బడా హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు.

అయితే...  మహేష్ బాబు హీరోగా ఆగడు సినిమాను 2014లో తీశాడు శ్రీను వైట్ల. ఈ సినిమా దూకుడులా సక్సెస్ అవుతుంది అనుకుంటే.. బోల్తా కొట్టింది. అప్పటినుంచి... శ్రీను వైట్లకు ఎదురుగాలే వీచింది. ఆ తర్వాత వచ్చిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో 2018 నుంచి సినిమాలు తీయడం మానేశాడు శ్రీనువైట్ల. అయితే తాజాగా హీరో గోపీచంద్ తో విశ్వం సినిమా చేసి.. మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: