టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ సొంతం చేసుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్న ప్రభాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకునే ఈయన ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈయన కోసం అమ్మాయిలే కాదు హీరోయిన్లు కూడా పడి చచ్చిపోతారనటంలో సందేహం లేదు. అలా ప్రభాస్ అంటే ఇష్టం పెంచుకొని ఏకంగా ఇద్దరు హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాలకి దూరం అయ్యారని తెలిసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ప్రభాస్ ఈ ఏడాదితో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అందులో భాగంగానే ప్రభాస్ ను  ప్రేమలో పడేయడానికి కొంతమంది హీరోయిన్లు ట్రై చేశారని , అందులో కొందరు ఆయనను ఇప్పటికీ ప్రేమిస్తూ ఉండగా.. ఒక ఇద్దరు మాత్రం ఎంతో కాలంగా ప్రేమిస్తున్నా ఆయన పట్టించుకోకపోవడంతో చివరికి తమై  మోసపోయామని తెలుసుకొని ఇబ్బంది పడుతున్నారని వారే అనుష్క , త్రిష అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.

ప్రభాస్ తో కలిసి మిర్చి, బిల్లా, బాహుబలి,  బాహుబలి 2 సినిమాలలో అనుష్క నటించగా..  అలాగే త్రిష ప్రభాస్ తో పౌర్ణమి, బుజ్జిగాడు , వర్షం సినిమాలలో నటించి మెప్పించింది. తొలుత ప్రభాస్ త్రిషతో ప్రేమలో పడ్డారని,  పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు.  కానీ ఇప్పటికీ త్రిష ప్రభాస్ ను తలుచుకుంటూ ఒంటరిగానే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.  మరొకవైపు అనుష్కతో కూడా ఈయన చాలా సినిమాలు చేశారు ఆ సమయంలో కూడా వీరిద్దరి కెమిస్ట్రీ బాగుందని , వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అభిమానులు కోరుకున్నారు. కానీ వీరి వివాహం జరగలేదు.  అటు త్రిష ఇటు అనుష్క ఇద్దరూ కూడా ప్రభాస్ కోసం ఎదురుచూస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఏది ఏమైనా ఇటు వీరిద్దరూ కూడా వివాహానికి దూరం కావడంతో ఇప్పుడు కొత్త అనుమానాలు ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: