సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు కొత్తగా సరికొత్తగా ట్రెండ్ అవుతూనే ఉంటాయి . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి సంబంధించిన వార్తలు ఏ విధంగా ట్రెండ్ అయ్యాయో మనం చూసాం. గ్లోబల్ స్ధాయి లో పాపులారిటీ సంపాదించుకున్నాక చరణ్ కి సంబంధించిన న్యూస్ లు బాగా వైరల్ అవుతూ ఉండటం గమనార్హం.


అంతేకాదు రీసెంట్గా మెగా కోడలు లావణ్య త్రిపాఠి కి సంబంధించి కూడా ఓ వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా లావణ్య త్రిపాఠికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎక్కువ వార్తలు ట్రెండ్ అవుతూ ఉండడం మనం గమనించాల్సిన విషయం. రీసెంట్గా లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అన్న వార్త ఎంత వైరల్ అయిందో చూసాము. అయితే ఆ వార్త పై మెగా కోడలు  లావణ్య త్రిపాఠి ఏ విధంగా స్పందించలేదు . అంతేకాదు తాజాగా సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి కి సంబంధించిన మరోక   న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.



లావణ్య త్రిపాఠి భర్త వరుణ్ తేజ్ ఓ స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడు అని ..ఆమె ఆయన ప్రేమను అంగీకరించకపోవడంతోనే.. వరుణ్ తేజ్ ఆ ప్రేమను అక్కడే మర్చిపోయాడు అంటూ ఓ వార్త బాగా వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు "పూజ హెగ్డే". టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ..వరుణ్ తేజ్ తో కలిసి "ముకుంద" అనే సినిమాలో నటించింది . ఈ సినిమా మంచి హిట్ అందుకుంది.



ఈ సినిమాలో వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ అద్దిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీరిద్దరి పై చాలా రకాల వార్తలు ట్రెండ్ అయ్యాయి. వీళ్లిద్దరూ ప్రేమాయణం నడుపుతున్నారు అంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి. మరి ముఖ్యంగా వీళ్లిద్దరి హైట్ బాగా మ్యాచ్ అయింది అంటూ మెగా ఫాన్స్ కూడా పూజా హెగ్డే మెగా ఇండి కోడలు కాబోతుంది అంటూ మాట్లాడుకున్నారు. కానీ పూజా హెగ్డే - వరుణ్ తేజ్ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదట.  ఆ కారణంతోనే  సైలెంట్గా తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేశాడు అంటూ ప్రచారం జరిగింది . ఒకవేళ ఆరోజు పూజ హెగ్డే కానీ వరుణ్ తేజ్ ప్రేమను యాక్సెప్ట్ చేసి ఉంటే.. లావణ్య త్రిపాఠి స్ధానం ఆమెదే అయ్యి ఉండేది..!

మరింత సమాచారం తెలుసుకోండి: