గడిచిన మూడు సంవత్సరాల నుంచి మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్గా కీయారా అద్వానీ నటిస్తూ ఉండగా డైరెక్టర్ శంకర్, దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసింది.


వాస్తవానికి డిసెంబర్లోనే ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం భావించిన కొన్ని కారణాల చేత సంక్రాంతికి పోస్టుపోన్ చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు పోస్టర్లను ఆకట్టుకోగా ఇటీవలే రా మచ్చ రా అనే పాట కూడా బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తాజాగా గేమ్ చేంజర్ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్  రావడంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. గేమ్ చేంజర్ సినిమా దీపావళి కానుకగా టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ అయితే వైరల్ గా మారుతున్నది.


గేమ్ చేంజర్ పోస్టర్లు అటు రాంచరణ్ , కియారా అద్వానీ,ఎస్ జే సూర్య, అంజలి కలిసి ఉన్న పోస్టర్ని సైతం చూపిస్తూ హైప్ పెంచేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్  కి సంబంధించి ఈ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి ఇది నిజమో కాదా తెలియాల్సి ఉన్నది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడమే కాకుండా రామ్ చరణ్ ప్రెస్టేజ్ సినిమాగా కూడా ఉన్నది.. ఎందుకంటే రాజమౌళితో సినిమా తీసిన తర్వాత తమ తదుపరి చిత్రం హీరోలందరికి ఫ్లాపులుగా వచ్చాయి. కానీ ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమాతో సక్సెస్ అందుకున్నారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: