మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాణంలో ఓ మూవీ స్టార్ట్ అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక ఆ మూవీ ఆగిపోయింది. మరి ఈ మూవీ ఎందుకు ఆగిపోయింది అనే దానిపై రామ్ గోపాల్ వర్మ కొంత కాలం క్రితం 9 ఇంటర్వ్యూ లో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. కొంత కాలం క్రితం రామ్ గోపాల్ వర్మ ఆ ఇంటర్వ్యూ లో పాల్గొనగా అందులో భాగంగా ఆయనకు చిరంజీవి గారితో ఓ సినిమాను స్టార్ట్ చేసి కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక ఆపేశారు. అసలు తప్పు ఎవరిది .? ఎందుకు అలా జరిగింది అనే ప్రశ్న ఆయనకు ఎదురయింది. దానికి రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇస్తూ ... చిరంజీవి తో సినిమా స్టార్ట్ చేశాను.

కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక ఆ సినిమా పక్కన పెట్టాను. ఆ విషయం లో పూర్తిగా తప్పు నాదే. అసలు ఏం జరిగిందంటే నేను సంజయ్ దత్ తో ఒక సినిమా కమిట్ అయి ఉన్నాను. అదే సమయంలో ఆయన జైలుకు వెళ్ళాడు. ఇప్పుడు వస్తాడు ... అప్పుడు వస్తాడు అని అన్నారు కానీ ఆయన బయటకు రాలేదు. దానితో నేను చాలా కాలం ఖాళీగా ఉండవలసి వచ్చింది. ఆ సమయం లో అశ్విని దత్ గారు చిరంజీవి తో సినిమా చేస్తారా అని ఆఫర్ ఇచ్చాడు.

నేను కూడా ఖాళీగా ఉండడం తో ఓకే చెప్పాను. సినిమా స్టార్ట్ అయింది కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యే సరికి సంజయ్ దత్ జైలు నుండి తిరిగొచ్చాడు. నా ఒరిజినల్ కమిట్మెంట్ అక్కడ ఉంది. దానితో నేను ఈ సినిమా వదిలి పెట్టాల్సి వచ్చింది. అలా నేను ఈ సినిమా కొంత భాగం పూర్తి అయ్యాక వదిలి పెట్టి వెళ్లడం తప్పు నాదే ఆ సమయంలో నేను చేసింది తప్పే అని రామ్ గోపాల్ వర్మ ఆ ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv