రాశిఖన్నా గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. 2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ఆ సినిమాలో తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. ఆ సినిమా అనంతరం బెంగాల్ టైగర్, జై లవకుశ, తొలిప్రేమ, సుప్రీమ్, థాంక్యూ, హైపర్, శ్రీనివాస కళ్యాణం వంటి అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


నితిన్, రామ్, ఎన్టీఆర్, రవితేజ, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్గా చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. తన అద్భుతమైన నటనతో పాటు తన అంద చందాలకు ఎంతో మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ మధ్యకాలంలో రాశిఖన్నా తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. రాశిఖన్నా తెలుగులో చివరగా నటించిన సినిమా థాంక్యూ.


ఈ సినిమాలో రాశి నటనకు మంచి ప్రశంసలు లభించాయి. కానీ ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అనంతరం ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు మానేసి తమిళ ఇండస్ట్రీవైపుకు మళ్ళింది. అరుణ్మనై 4 సినిమాలో మంచి పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. అక్కడ మంచి సక్సెస్ అందుకోవడంతో రాశికన్నా అభిమానులు తెలుగులో కూడా సినిమాలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ప్రశ్నలకు సమాధానం దొరికింది.


రాశికన్నాకు టాలీవుడ్ హీరోతో ఓ చిన్న గొడవ జరిగిందట. ఆ కారణంగానే తెలుగులో అవకాశాలు వచ్చినా కూడా చేయడానికి ఈ బ్యూటీ ఆసక్తిని చూపించడం లేదు. ప్రస్తుతం ఈ విషయంపై ఇండస్ట్రీవర్గాల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాల్సి ఉంది. నిజంగానే రాశికి ఓ హీరోతో గొడవ జరిగిందా లేకపోతే తానే సినిమాలు చేయడం లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: