కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తున్న పాన్-ఇండియా యాక్షన్ ఫాంటసీ డ్రామా కంగువ. ఈ సినిమా సూర్య కెరీర్‌లో మరియు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత  భారీ బడ్జెట్ సినిమాగా రానుంది. ఈ సినిమాను కోలీవుడ్ బాహుబలిగా ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఈ సినిమాలో సూర్య కు జోడిగా బాలీవుడ్  దిశా పటానీ నటిస్తున్నారు. అలాగే బాబీ డియోల్ విలన్ రోల్ లో నటించారు. సూపర్ హిట్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 14 న విడుదల కానుంది. రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై హైప్ మరియు అంచనాలు  భారీగా  పెరుగుతున్నాయి.రెండు రోజుల క్రితం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఏ ఎం బి మాల్ లో నిర్వహించగా ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. అభిమానుల చూపించిన ప్రేమకు సూర్య ఎమోషనల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా దాదాపు 2000 కోట్ల వరకు వసూలు చేస్తుంది అని నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు.

ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమా ఉండబోతుందని ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ సినిమాకి సంబంధించిన ఆడియో లాంచ్ వేడుక నిన్ను చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ లో సూర్య మాట్లాడుతూ నేను కాలేజీలో బాస్ అని పిలిచేవాడిని, నా సీనియర్ ఇప్పటికీ కూడా నేను అలానే పిలుస్తుంటాను. నాతో రెండు సినిమాలు చేశారు. ఉదయానికి స్టాలిన్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు అంటూ గుర్తు చేసుకున్నారు. అలానే నా ఇంకో స్నేహితుడు తను కూడా రాజకీయాల్లో ఉన్నాడు అంటూ విజయ గురించి కూడా చెప్పుకొచ్చాడు సూర్య ఈ మాటలు సూర్య ఫ్యాన్స్ తో పాటు మిగతా అభిమానులు కూడా విపరీతంగా నచ్చాయి. అందుకే సూర్యను అందరూ ఇష్టపడతారు అని చెప్పొచ్చు.ఈ నేపథ్యంలో ఈ సినిమా నవంబర్ 14ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలావుండగా కంగువ నిర్మాణ భాగ‌స్వామ్యంలో యువి సంస్థ ఉండ‌టంతో తెలుగు వెర్ష‌న్ కు కూడా భారీ రిలీజ్ ద‌క్క‌నుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మీద అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. సూర్యసినిమా కోసం రెండేళ్లుగా క‌ష్ట‌ప‌డుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: