టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా రాణిస్తున్న బ్యూటీ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమాతో పరిచయమైన మీనాక్షి ఆ సినిమా అనంతరం వరసగా సినిమా అవకాశాలను అందుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. హిట్, కిలాడి వంటి సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది.


ఆ సినిమాల అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఏకంగా మహేష్ బాబుకు మరదలు పాత్రలో గుంటూరు కారం సినిమాలో నటించింది. ఇటీవల విడుదలైన తమిళ సూపర్ స్టార్ విజయ్ గోట్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన లక్కీ భాస్కర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా విశ్వక్సేన్ సరసన మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ తో మట్కా సినిమాల్లో కూడా హీరోయిన్గా చేస్తోంది.

ఇదిలా ఉండగా.... గత కొన్ని రోజుల క్రితం మీనాక్షి చౌదరి వివాహం చేసుకోబోతుందంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. ఓ స్టార్ హీరోని వివాహం చేసుకోవాలని మీనాక్షి సిద్ధమైందంటూ ఇండస్ట్రీవర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగాయి. వీరిద్దరి మధ్య చాలా కాలం నుంచి ప్రేమ కొనసాగుతోందని, ఆ కారణంగానే వారు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. అనంతరం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ వచ్చింది.


ఈ వార్త మరిచిపోయేలోపే మీనాక్షి చౌదరికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. మీనాక్షి చౌదరికి రాత్రి సమయాల్లో ఓ దర్శకుడు మెసేజ్ లు పెట్టి తెగ ఇబ్బంది పెడుతున్నాడట. తాను చెప్పినట్టుగా చేస్తే సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మెసేజ్ చేస్తున్నాడట. మరి ఆ డైరెక్టర్ ఎవరు అనేది బయటికి రాలేదు. కానీ ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: