మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే న‌టులలో ఎన్టీఆర్ కూడా ఒకరు.. ఎన్టీఆర్ డైలాగ్ చెప్తే థియేటర్ దద్దరిల్లాల్సిందే.. ఆయన డాన్స్ చేస్తే అభిమానులకు పూనకాలు రావాల్సిందే. ఇప్పటికే  ఎన్టీఆర్ నటను ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో కొనియాడారు. ఎలాంటి కఠినమైన డైలాగ్ నైనా సింగిల్ టేక్ లో చెప్పగల హీరో. అలాగే ఎలాంటి కష్టమైన డాన్స్ మూవ్మెంట్ అయినా ఇట్టే పట్టేస్తాడు . ప్రస్తుతం ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఫాలోయింగ్ వచ్చింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో అయితే జపాన్లో ఏకంగా భారీ అభిమానులను సొంతం చేసుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యడు .


ఇక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రెండు భాగాలుగా తీసుకురాబోతున్నాడు ఇక రెండో భాగంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ గురించి గతంలో దర్శకుడు కృష్ణవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ చేసిన పనికి సీనియర్ నటి సుహాసిని కన్నీళ్లు పట్టుకున్నారని ఆయన చెప్పాడు ఎన్టీఆర్ డైలాగ్స్ ఇరగదీస్తాడని అందరికీ తెలుసు .


ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఓ పని రాక్షసుడు ఎంత పెద్ద డైలాగు అయిన ఇట్టే ఆయన చెప్పేస్తాడు.. రాఖీ సినిమాలో క్లిమక్స్ డైలాగ్ ఇస్తే అన్న పదినిమిషాలు అన్నాడు. వచ్చాడు బోన్‌లో నిలబడి .. టక టక చెప్పేశాడు. తారక్ డైలాగ్ చెప్తుంటే సుహాసినిగారు అలా చూస్తూ ఉండిపోయారు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు  కారిపోయాయి. ఆమె వెంటనే పక్కకు వెళ్లి కళ్ళు తూడ్చుకున్నారు అని కృష్ణవంశీ అన్న‌రు. అబ్బా అంత మెమరీ ఉంది తారక్ కు.. ఆ తర్వాత అంత మెమరీ మహేష్ బాబు కు ఉంది అని కృష్ణవంశీ అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: