తెలుగు సినీ పరిశ్రమకు చాలామంది విలన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇతర భాషలలోని హీరోలు కూడా టాలీవుడ్ చిత్రాలలో విలన్ గా నటించడానికి మక్కువ చూపుతో ఉన్నారు. అలాంటి వారిలో నటుడు బాబి సింహా కూడా ఒకరు. హైదరాబాద్లో పుట్టినప్పటికీ తమిళంలో హీరోగా రాణిస్తూ ఉన్నారు బాబీ సింహ. మొదట సిద్ధార్థ హీరోగా నటించిన లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాబి సింహ ఆ తర్వాత తమిళంలోనే చాలా సినిమాలలో నటించారు.


తమిళంలో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించిన బాబు సింహ జిగర్తాండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. తెలుగులో డిస్కో రాజా, రన్, గల్లీ రౌడీ, అమ్మ తదితర చిత్రాలలో నటించారు.ఆ తర్వాత చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య చిత్రంలో విలన్ మెప్పించారు. ఈ సినిమాతోనే బాబి సింహ భారీ క్రేజ్ అందుకున్నారు. ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో కూడా మరొక విభిన్నమైన పాత్రలో నటించారు బాబి. ఇదంతా ఇలా ఉంటే బాబి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తన భార్య కూడా తెలుగులో నటించిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు.


బాబీ సింహ భార్య పేరు రేష్మి మీనన్.. ఈమె తెలుగులో కూడా చాలా చిత్రాలలో నటించిందట.. 2002లో బాలనటిగా 2010లో తమిళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు శంకర్ హీరోగా నటించిన నేను రకం అనే చిత్రంలో ఇమే హీరోయిన్గా నటించిందట. ఆ తర్వాత 2018 లో రాహుల్ రవీంద్రనాథ్ నటించిన హైదరాబాద్ లవ్ స్టోరీ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా నటించింది.ప్రస్తుతం అయితే సినిమాలకు దూరంగానే ఉంటూ తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది రేష్మి మీనన్. కానీ బాబీ సింహా ఫ్యాన్స్ మాత్రం ఏంటి ఈ విలన్ ఇంతటి అందమైన హీరోయిన్ ఈయన భార్యనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: