యాంకర్ అనసూయ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీ యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా వెండితెరకు పరిచయమైంది. అనంతరం నటి కావాలన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రంగస్థలం సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమా అనంతరం అనసూయ వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ యాంకర్ గా కొనసాగుతున్న వారిలో అనసూయ ఒకరు.


ప్రస్తుతం అనసూయ తన యాంకరింగ్ కు వీడ్కోలు కనిపిస్తున్న బిజీగా మారిపోయింది. ఎప్పుడు బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ఇదిలా ఉండగా.... అనసూయ తాజాగా మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ 8వ సీజన్ కు హాజరైంది. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కారణంగా అనసూయ బిగ్ బాస్ కి గెస్ట్ గా వెళ్ళింది.


ఈ సందర్భంగా పుష్ప-2 సినిమా గురించి హోస్ట్ నాగార్జున కొన్ని విషయాలు అడిగారు. వాటికి అనసూయ సమాధానం చెప్పింది. ఇప్పుడు విలన్ అయ్యావు పుష్ప అని బెదిరిస్తున్నావు పుష్పకు సంబంధించిన కొన్ని విషయాలు అని అనసూయతో నాగార్జున అన్నారు. వెంటనే అనసూయ వెనుక ఉంటానంటే చెప్పేస్తాను అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది.


తాను ఎక్కడికి వెళ్ళనని నాగార్జున అన్నారు. ఇక అనసూయ పుష్ప-2 సినిమాలో పది నిమిషాలకు ఓ హై ఇచ్చే మూమెంట్ ఉంటుందని తెలిపింది. మొదటి పార్ట్ కంటే పుష్ప-2 ది రూల్ లోనే అసలు కథ ఉందని తెలియజేసింది. ప్రతి పది నిమిషాలకు ఓ హై ఉందని సినిమాలో ఉన్న నాకే అనిపిస్తుంది అంటూ అనసూయ వెల్లడించింది. అనంతరం కాసేపు ముచ్చటించిన అనంతరం అనసూయ వెళ్ళిపోయింది. ప్రస్తుతం అనసూయ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: