కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణ భయం పట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడిపారు అందరూ. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం ఎప్పుడు ప్రాణం ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో డబ్బులు సంపాదించి లగ్జరీ లైఫ్ గడపడం కాదు.. ఒంట్లో ప్రాణం ఉంటే సరిపోతుంది దాన్ని కాపాడుకోవడం మొదటి టార్గెట్ అన్న విధంగా అందరి ఆలోచన తీరు మారిపోయింది.


 దీంతో అందరూ ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే తర్వాత కాలంలో అందరూ వ్యాక్సిన్లు తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత ఎంతోమంది సడన్ హార్ట్ ఎటాక్లతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయ్. ఈ ఘటనలు ప్రతి ఒక్కరిలో మరోసారి ప్రాణ భయాన్ని కలిగించాయి. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా కనిపించిన వారు నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయి ప్రాణాలు వదలడం చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే ఇక ఇటీవల కాలంలో కాస్త గుండెలో నొప్పిగా అనిపించిన తెగ భయపడిపోతున్నారు.


 ఇలా గుండెపోటు మరణ వార్తలు ఎక్కువ అవుతూ ఉండడంతో ఛాతి నొప్పి వచ్చినా కూడా కొందరు ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే అలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ చెబుతున్నారు వైద్య నిపుణులు. గుండె కండరాలకు అవసరమైనంత రక్తం లభించినప్పుడు కూడా ఇలా చాతిలో నొప్పి వస్తుంది. దీనిని అంజినా పెక్టోరిస్ అని అంటారు అంటూ వైద్యులు చెప్పుకొచ్చారు. ఇది చాతిలో ఒత్తిడి వల్ల వచ్చిన నొప్పి మాత్రమే నడవడం వ్యాయామం చేయడం వల్ల శారీరక శ్రమ పెరిగి ఇలాంటిది వస్తూ ఉంటుంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుంది అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: