సినీ నటుడు విక్కీ కౌశల్ గురించి పరిచయం అనవసరం. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. దినేష్ విజన్ ఈ మూవీకి నిర్మాతగా పనిచేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి వీరిద్దరూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా టైలర్ రిలీజ్ వేడుక ముంబాయిలో జరిగింది. ఈ సినిమాలోని 'జానే తూ..' అనే గీతాన్ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న విక్కీ కౌశల్ కూడా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం తనకి చాలా నచ్చిందని చెప్పుకొచ్చాడు. శంభాజీ మహరాజ్‌ లాంటి గొప్ప పాత్రలో నటించడం మామూలు విషయం కాదని.. ఆ పాత్ర దొరకడం తన అదృష్టం అని తెలిపాడు. జీవితంలో ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుందని ఆయన చెప్పాడు. ఈ సినిమా కోసం తాను శారీరకంగా.. అలాగే మానసికంగా ఎంతగానో శ్రమించనని తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ కి ముందే విక్కీ కత్తి శాము, యుద్దాలు, గుర్రపు స్వారీలలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పాడు. వీటన్నింటి కంటే కూడా శంభాజీ మహారాజ్‌ పాత్రలో నటించడంమానేది.. ఆ పాత్రకు తగ్గట్లుగా తన మనసును సిద్ధం చేయడం అనేది తనకు సవాల్ గా మారిందని తెలిపాడు. ఛత్రపతి శివాజీ.. శ్రీరాముడి లాంటి వారని, శంభాజీ.. సింహం లాంటి యోధుడు అని తెలిపాడు. ఆ పాత్రల్ని ఇంతకన్నా గొప్పగా తాను వర్ణించలెడని చెప్పుకొచ్చాడు. ఇలాంటి గొప్ప యోధుల కధలను ప్రేక్షకులకు చూపించబోతున్నందుకు తనకు ఎంత గర్వంగా ఉందని తెలిపాడు. అలాగే తనకు రెహమాన్‌ సంగీత అందించే సినిమాలో పని చేయాలని కల ఉండేదని.. ఈ సినిమాతో ఆ కల నెరవేరిందని విక్కీ చెప్పుకొచ్చాడు. ఇక విక్కీ తెలుగులో మాట్లాడడం జరిగింది. అది చూసిన టాలీవుడ్ ఆడియన్స్ తమ హృదయాలను గెలుచుకున్నాడని అని కామెంట్స్ వర్షం కురుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: