క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పని చేసిన తర్వాత దర్శకుడుగా మారాడు .. మొదటి సినిమా ఉప్పెన తోనే టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు .. మెగా హీరో వైష్ణవ తేజ్ , కృతి శెట్టి ఇండస్ట్రీకి ఈ మూవీ తోనే పరిచయమయ్యారు .. అలాగే విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటించారు. అయితే ఉప్పెన సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు .. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ డ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి .. రామ్ చరణ్ గేమ్ చేంజర్ హడావిడి కూడా పూర్తవడంతో ఇప్పుడు బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ పెట్టాడు మెగా పవర్ స్టార్ .. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైర్లుగా మారింది .. ఈ సినిమా రంగస్థలం సినిమా అలాగా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది .. అంతేకాకుండా ఈ సినిమాలో చరణ్ గుడ్డివాడిగా నటిస్తున్నాడని కూడా టాక్ వినిపిస్తుంది .. ఇక రంగస్థలం సినిమాలో చరణ్ చెవిటి వాడి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు .. ఇక ఇప్పుడు ఈ సినిమాలో గుడ్డివాడిగా కనిపిస్తాడని కూడా అందరూ అంటున్నారు మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.