సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ రీసెంట్ గానే లక్కీ భాస్కర్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే .. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది .. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షను రాబట్టింది .. గత సంవత్సరం దీపావళి కనుక‌గా అక్టోబర్ 31 థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్లు అందుకుంది .. సితార ఎంటర్టైన్మెంట్స్ , పర్సున్ ఫోర్ సినిమా సంయుతంగా నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది ..


ఇక 2021 లో వచ్చిన సెకండ్ షో సినిమాతో దుల్కర్ తన సినీ జీవితాన్ని మొదలుపెట్టాడు .. ఆ తర్వాత వచ్చిన ‘ఉస్తాద్ హోటల్’  సినిమాతో మలయాళ ప్రేక్షకుల మదిలో  చెరగపోని స్థానం తెచ్చుకున్నాడు . ఆ తర్వాత మళయాలం , తమిళం లో ఎన్నో సూప‌ర్ హిట్‌ సినిమాలో నటించాడు .. అలాగే తన సినిమాల్లో సహజమైన నటన‌తో అభిమానుల గుండెల్లో చెరగపోని స్థానం తెచ్చుకున్నాడు ఈ మలయాళీ హీరో .. అయితే ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మరోసారి టాలీవుడ్ దర్శకుడితో ఓ భారీ సినిమా చేయబోతున్నాడు ..


అయితే దుల్కర్ టాలీవుడ్ డెబ్యూ  డైరెక్టర్ రవి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు .. ఇక ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించబోతున్నటు  తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో దుల్కర్ కు జంటగా టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్గా నటించబోతుందని టాక్ బయటికి వచ్చింది .. చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న పూజా ఇప్పుడే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది .. ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలకు ఓకే చెబుతుంది ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కు జంటగా నటించబోతుందనే వార్తలు బయటకు వస్తున్నాయి .




మరింత సమాచారం తెలుసుకోండి: