నందమూరి నటసింహ బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా.. రాజకీయ ఇతర రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు బాలయ్యకు వరుసపెట్టి శుభాకాంక్షలు చెబుతున్నారు. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన క్రమంలో బాలయ్య సోదరి .. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి హైదరాబాద్ సమీపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలలో నందమూరి - నారా కుటుంబాలకు చెందిన వారితో పాటు పలువురు సినీ.. రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ క్రేజీ కామెంట్ చేశారు ప్రస్తుతం ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఒక పక్కన బాలయ్య మరో పక్కన అంతే పవర్ఫుల్ భువనేశ్వరి ఇద్దరి మధ్య ఇప్పుడు నేను నలిగిపోతున్న అని ఆయన నవ్వుతూ మాట్లాడటం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ వీరిద్దరి మధ్య ఉంటే చాలా ప్రమాదం.. నిన్నటి వరకు అల్లరి బాలయ్య .. ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య దేశం గర్వించదగ్గ బిడ్డ మా కుటుంబంలో ఎలాంటి అవార్డు అవ్వడం ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులు అందరం ఎంతో గర్వపడుతున్నాం నాకు ఒక అద్భుతమైన బావమరిది గా బాలయ్య దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నా అని చంద్రబాబు చెప్పుకు వచ్చారు. ఇక బాలయ్య హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాల విషయానికి వస్తే సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బాలయ్య దసరాకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.