టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్  సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తూ ఉండగా నిన్నటి రోజున ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. గీత బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఒక యదార్థ ప్రేమ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఫిబ్రవరి 7వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతున్నది. అయితే ఈ సినిమా విడుదల సమయం  దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ని వేగవంతం చేసింది.


తండేల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ గెస్ట్ గా వచ్చారు. అక్కడ పలు విషయాలను కూడా తెలియజేయడమే కాకుండా ఎన్నో తెలియని విషయాలను కూడా తెలిపారు. నాగచైతన్య కూడా తన భార్య శోభితా గురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు.. ఇంట్లో శోభితాను బుజ్జి తల్లి అని పిలుస్తూ ఉంటానని.. ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా అలాగే పిలుస్తూ ఉంటానని వెల్లడించారు.



సమంతతో విడాకుల అనంతరం శోభితతో ప్రేమాయణం నడిపిన నాగచైతన్య కొన్ని నెలలు డేటింగ్ చేసి మరి గత ఏడాది వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్ళిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. గత ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం జరిగింది .ఇక అప్పటినుంచి వీరి గురించి నిత్యం ఏదో ఒక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. వివాహమైన అనంతరం నాగచైతన్య నటిస్తున్న సినిమా కావడం చేత ఈ సినిమా పైన అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. మరి నాగచైతన్య సినీ కెరియర్ లోని అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టే చిత్రంగా తండేల్ నిలుస్తుందనీ  చిత్ర బృందం భావిస్తోంది మరి అది ఎంతవరకు సాధ్యమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: