మన తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి పెంచిన దర్శకులలో కె.వి రెడ్డి, దాసరి నారాయణరావు, రాఘవేందర్రావు , బాబు - రమణలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో దర్శకులు ఉన్నారు .. వీరీ తర్వాత వచ్చిన దర్శకులలో రాజమౌళి మాత్రం తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమా దగ్గరికి తీసుకువెళ్లి తెలుగు సినిమా అంటే ఏంటో అందరికీ చూపించాడు. రాజమౌళి దగ్గర నుంచి సినిమా వస్తుందంటే ఇండియన్ సినిమా మొత్తం షేక్ అయిపోతుంది .. అలాగే హాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం రాజమౌళి సినిమా కోసం ఎదురుచూసేలాగా తన టేకింగ్ , డైరెక్షన్ తో ప్రపంచ సినిమాకు తానేంటో చూపించాడు. అలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ వైల్డ్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నాడు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి ..
 

అలాగే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్టు తెలుస్తుంది .. ఈ సినిమాలో మహేష్ కు జంటగా ఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుంది. మరో కొన్ని రోజులనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుకానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి భారీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు కాశీకు సంబంధించి మణికర్ణిక ఘాట్ సెట్‌ వేయాలని ఉద్దేశంలో రాజమౌళి ఉన్నారట.. ఈ సినిమాలో పురాణాలకు సంబంధించిన  రిఫరెన్స్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది .. ఇందులో భాగంగానే కాశీ  సెట్‌గా వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ..


అయితే కాశీలో షూటింగ్ చేయడానికి ఎక్కువ రోజులు పర్మిషన్ దొరకకపోవటంతో . ఇప్పుడు ఆ లొకేషన్ ను ఇక్కడ సెట్‌ రూపంలో వేసి వాడుకోవాలని ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారట .. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ భారీ సెట్‌ వేస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే మణికర్ణిక ఘాట్‌కి ఓ ప్రత్యేకత కూడా ఉంది .. అది ఏమిటంటే అక్కడ ఎప్పుడూ చితి కాలుతూనే ఉంటుంది .. ఎక్కువమంది కాశీలో చనిపోవాలని కోరుకుంటారు. తద్వారా వాళ్లకు పుణ్యం వస్తుందని స్వర్గానికి వెళ్తారని అందరూ నమ్ముతారు .. అందువల్లే ఈ ఘాట్‌ వద్ద నిత్యం చాలా మంది చనిపోతూ ఉంటారు .. అందుకే అక్కడ శవాలు కాలుతూ ఉంటాయి .. ఈ ప్రాసెస్ లోనే ఇక్కడ మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరించే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారట. ఇక మరి రాజమౌళి , మహేష్ బాబుతో తెర్కక్కించే ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కొత్త సంచనలు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: