చాలా రోజుల తర్వాత పబ్లిక్ ఫ్లాట్ ఫారం మీదకు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తారని అంతా ఎదురు చూశారు. తండేల్‌ జాతర అంటూ ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు బన్నీ వస్తారని ప్రకటించారు .. అఫీషియల్ గా ప్రకటన కూడా వచ్చింది. సంథ్య థియేట‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత భ‌య‌ప‌డి .. అలాంటి సంఘ‌ట‌న లు పున‌రావృతం కాకూడ‌ద‌ని .. చాలా తక్కువ మందిని మాత్రమే పిలిచారు. అందువల్ల ఖచ్చితంగా బన్నీ వస్తారని అందరూ అనుకున్నారు. పోలీస్ పర్మిషన్ అవసరం లేదు ఎందుకంటే ఇన్‌ హౌస్ ఈవెంట్ కనుక .. మామూలు సమాచారం ఇస్తే సరిపోతుంది. కానీ వివిధ కారణాల వల్ల ఒక రోజు వాయిదా వేశారు. అది కూడా కచ్చితంగా బన్నీ రాక కోసమే అని అందరూ అనుకున్నారు.


అయినా బన్నీ రాలేదు .. ఈవెంట్ ముగిసే టైం కు వస్తారని అంతా ఎదురు చూశారు .. కానీ రాలేదు. దీనికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. బన్నీ నడుస్తుంటే కాలు స్లిప్పు అయ్యి మెలిక పడిందని .. అందువల్ల రాలేదన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో ఇంటర్నల్ గా వినిపిస్తున్నాయి. అలాంటిది ఉంటే తండ్రి అల్లు అరవింద్ వేదిక మీద అఫీషియల్ గా చెప్పి ఉండాలి .. అలాంటిదేమీ చెప్పలేదు .. తండేల్ సినిమా బన్నీ చూసి ఉంటారని సంతృప్తి చెంది ఉండ‌ర‌ని .. ఇప్పుడు వేదిక మీదకు వస్తే కచ్చితంగా హిట్ .. సూప‌ర్ హిట్ లాంటి మాటలు చెప్పాల్సి వస్తుందని అందుకే రాలేదన్న గుసగుసలు కూడా మరో పక్క వినిపిస్తున్నాయి.


సినిమా అల్లు అర్జున్ కుటుంబం బ్యానర్ మీద నిర్మించారు. తండ్రి నిర్మాత .. అలాగే తన సన్నిహితుడు .. స్నేహితుడు బన్నీ వాస్ మరో నిర్మాత. అలాంటి సినిమా ఫంక్షన్కు బన్నీ కచ్చితంగా వస్తారని అధికారిక ప్రకటన వచ్చాక కూడా స్కిప్‌ కొట్టారంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని వినిపిస్తోంది. అది ఏమిటన్నది మెల్లమెల్లగా గాని బయటకు రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: