టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది సినీ నేపథ్యం నుంచి ఉన్న కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. అలాంటి వారిలో మహేష్ బాబు ఒకరు. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. తనదైన నటన, అందంతో ఎన్నో సినిమాల్లో నటించి విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మహేష్ బాబుకి యూత్ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన కెరీర్ లో ఎంతో మంది దర్శకులతో మహేష్ బాబు సినిమాలు చేశారు. 


ఇక డైరెక్టర్ రాజమౌళితో ఇంతవరకు ఎలాంటి సినిమాల్లో మహేష్ బాబు నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అంతేకాకుండా షూటింగ్ సమయంలో ఎవరూ కూడా షూటింగ్స్ స్పాట్ కి ఫోన్లను తీసుకురాకూడదని అగ్రిమెంట్ జరుపుకున్నారట.


ఈ అగ్రిమెంట్ ను కాదని ఎవరైనా ఫోన్స్ తీసుకువచ్చిన, సినిమాకు సంబంధించి ఏమైనా సన్నివేశాలను చిత్రీకరించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటారని ఇటీవలే వెల్లడించారు. కాగా ఎస్ఎస్ఎంబి29 సినిమాపై కథ రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా పూర్తిగా అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వెల్లడించాడు.


మహేష్ బాబు ఇమేజ్, గత సినిమాలను దృష్టిలో పెట్టుకొని సినిమా కథ కాంటెంపరరీలో ఉందా అని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సినిమా ద్వారా అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇస్తామని విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఒక హింట్ బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: