గత సంవత్సరం ఎంతో వివాదాస్పదమైన కేసుల్లో ప్రధానంగా జానీ మాస్టర్ కేసు, రాజ్ తరుణ్ కేసు ఎంతో ముఖ్యమైనవి .. ఈ రెండు కేసులు కూడా కొత్త ఏడాదిలో కూడా అలాగే కొనసాగుతూ వస్తున్నాయి .. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ ఈ వివాదాలు మరోసారి మెల్లమెల్లగా రాచుకుంటు మరోసారి తేర‌ మీదకు రాబోతున్నాయి. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ కేసు కొంత చతిగల బడిందని అంతా భావించారు .. కానీ ఇప్పుడు ఈ వివాదానికి సంబంధించిన ఇంటర్వ్యూ లతో కౌంటర్ ఎన్కౌంటర్లు గట్టిగా నడుస్తున్నాయి .. ముందుగా జానీ మాస్టర్ తన భార్యతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు తనపై కేసు పెట్టిన శ్రేష్ఠ వర్మ పై పలు కీలక ఆరోపణలు చేశాడు.


ఇక దానికి కౌంటర్గా శ్రేష్ట కూడా బయటికి వచ్చింది .. అలాగే ఓ మీడియా  కు భారీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది .. అలాగే జానీ మాస్టర్ పై అతని భార్యపై కూడా భారీ ఆరోపణ చేసింది .. ఇప్పుడు శ్రేష్ట మాటలకు కౌంటర్ ఎటాక్ గా ఆ తర్వాత జానీ మాస్టర్ భార్య కూడా స్పందించింది. ఇలా జానీ మాస్టర్ , శ్రేష్ట వివాదం మరోసారి తెరమీదకు వచ్చేసింది .. అదేవిధంగా మరోసారి రాజ్ తరుణ్ వివాదం కూడా మెల్లమెల్లగా రాజుకుంటూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది .. ఈ వివాదానికి అటు ఇటుగా ఓ నెలరోజుల గ్యాప్ ఇచ్చిన లావణ్య మ‌రోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది .. మస్తాన్ సాయి పై ఆమె కంప్లైంట్ ఇచ్చింది .. పలు నగ్న వీడియోలు ఉన్నాయని చెబుతున్న హార్డ్ డిస్క్ కూడా పోలీసులు దగ్గరకు వెళ్ళింది . అలాగే మరోవైపు ఈ కేసులో ఒకప్పుడు బాగా నలిగిన పేరు శేఖర్ భాషను హత్య చేసే కుట్ర జరుగుతుందంటూ తాజాగా ఓ ఆడియో బయటపడింది ..


లావణ్య స్నేహితురాలు మరో వ్యక్తితో మాట్లాడుతున్న ఫోన్ ఆడియో లీక్‌ అయింది .. ముక్కలు ముక్కలుగా నరికి శేఖర్ బాషను చంపాలంటూ ఆ యువతి మాట్లాడిన ఆడియో ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ గా మారింది. ఈ రెండు వివాదాలు కంటే ముందే మంచి ఫ్యామిలీ గొడవ తెరపైకి వచ్చింది .. సంక్రాంతి పండగ నుంచి ఈ వివాదం రాసుకున్న ప్రస్తుతం కోర్టుల‌ చుట్టూ తిరుగుతుంది .. రీసెంట్ గానే కుక్క అంటూ ఒకరిపై ఒకరు పెట్టుకున్న ట్వీట్లు కేసులు ఇలా ఆదనంగా మసాలా దట్టించి వర్ధించినట్టయింది. ఇలా ఇప్పుడూ రాజ్‌ తరుణ్ , లావణ్య కేసు , జానీ మాస్టర్ - శ్రేష్ట కేసు , మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ఈ ఏడాది కూడా హైలెట్గా నిలవడం విశేషం .. మరి కొన్ని నెలపాటు ఈ మూడు కేసులు మీడియాకు మంచి దమ్ బిర్యాని అందించడం కాయంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: