యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్'. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఇది.షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. విడుదలకు దగ్గరవుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. ఈ నుంచి విడుదలైన పోస్టర్ దగ్గర నుంచి పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.పై ఉన్న అంచనాలను ట్రైలర్ తారాస్థాయికి చేర్చింది. ఇక ఈ లో అందమైన ప్రేమకథను చూపించనున్నారు. గతంలో లవ్ స్టోరీ లో ఆకట్టుకున్న సాయి పల్లవి, నాగ చైతన్య. తండేల్ తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేయనున్నారు. 

తండేల్ సూపర్ హిట్ అవుతుందని సినిమాను కింద సెంటర్స్ లో థర్డ్ పార్టీలకు హోల్ సేల్ గా ఇవ్వొద్దని కూడా నిర్మాతల నుండి డిస్ట్రిబ్యూటర్లకు సంకేతాలు అందాయని టాక్ వినిపిస్తుంది. అంత నమ్మకంగా ఉంది టీమ్. కానీ అక్కినేని అభిమానులను ఓ విషయం మాత్రం కాస్త టెన్షన్ పెడుతుంది. కారణం డైరెక్టర్ చందు మొండేటి. ఈ దర్శకుడు అక్కినేని నాగ చైతన్యతో ప్రేమమ్,సవ్యసాచి అనే రెండు సినిమాలు తెరకెక్కించాడు. అందులో ప్రేమమ్ రీమేక్.. అది కూడా ఓ మోస్తరు హిట్ గా నిలిచింది. ఇక భారీ బడ్జెట్ భారీ హైప్ తో వచ్చిన సవ్యసాచి డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ముచ్చటగా మూడవ సినిమా తండేల్. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు. రియల్ గా జరిగిన కథ అయినప్పటికీ దాన్ని చందు మొండేటి తెరపై ఎలా మలిచాడనేది ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సేంటిమెంట్ ను బ్రేక్ చేసి నాగ చైతన్య కు చందు ఎలాంటి హిట్ ఇస్తాడో రెండు రోజుల్లో తేలుతుంది.ఇదిలావుండగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ పాటలు మరొక హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి. 'లవ్ స్టోరీ' తరువాత చై- పల్లవి కాంబోలో రాబోతున్న ఈమూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: