కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 6వ సీజన్‌లో కామన్‌ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి తన ఆట, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఫైనల్ వరకు వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా తనదైన శైలిలో బిగ్ బాస్ షో రివ్యూలు చెబుతూ బాగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఆదిరెడ్డి ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లోకి తన భార్య కవితతో కలిసి అడుగుపెట్టాడు.
ఇటీవల ఆయన రైతు గురించి కొన్ని విషయాలు పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. రైతు అందరి కంటే గొప్పని చెప్పుకొచ్చాడు. కానీ రైతుకి తగిన గౌరవం మాత్రం దక్కడం లేదని తెలిపాడు. రైతు ఏ పని మీద ఎక్కడికి వెళ్లిన గౌరవం ఇవ్వాల్సిన వాళ్లే కాసురుకుంటారని చెప్పాడు. చాలా మంది రైతులు అప్పుల బాధలతో చనిపోయారని.. అందరికీ కడుపునిండా అన్నం పెట్టే అన్నదాతకే ఎక్కడ విలువ ఉండదని ఆదిరెడ్డి అన్నాడు. ప్రతిఒక్కరూ ముందుగా రైతుకి గౌరవం ఇవ్వాలని, రైతుని గుర్తుపెట్టుకోవాలని ఆ తర్వాత సైనికుడుకి గౌరవం ఇవ్వాలని ఆయన చెప్పుకొచ్చాడు.  ఇక తన తల్లి సూసైడ్ చేసుకోని చనిపోయిందని చెప్పాడు. అప్పుల బాధకే తాను అలా చేసిందని తెలిపాడు. ఎంత ప్రయత్నించినప్పటికి తన తల్లిని కాపాడుకోలేక పోయాడని బాధపడ్డాడు.
ఇక ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకొని.. మూడో సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సీజన్ 3లో కూడా అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన యాంకర్ ఓంకార్ యే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లోకి తొమ్మిది ఇస్మార్ట్ జంటలు అడుగుపెట్టాయి. ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు ఈ షోలో పాల్గొంటున్నాయి. ఇకపోతే ఈ సీజన్ లో అమర్ దీప్, తేజు మొదటి స్థానంలో ఉన్నారు. మరి చివరికి ఏ జంట గెలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: