నలుగురికి ఆదర్శప్రాయంగా నిలవాల్సిన స్టార్స్ ఇలా చిన్నచిన్న కారణాలకు డివర్స్ తీసుకుంటే నెక్స్ట్ అసలు సమాజం ఎటు పోతుంది అంటూ కూడా చాలామంది జనాలు మాట్లాడుకున్నారు . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పేర్లు మరొకసారి ట్రెండిం గా మారాయి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు . నాగచైతన్య కి ఇది రెండో పెళ్లి . శోభిత ధూళిపాళ్లకి నాగచైతన్య మధ్య ఏదో ఎఫైర్ ఉంది అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. అయితే వాటిపై పెద్ద రియాక్ట్ అవ్వలేదు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల.
ఏకంగా నిశ్చితార్థం చేసుకొని పెళ్లి బట్టల్లో దర్శనమిచ్చారు. ఇప్పుడు భార్యాభర్తలు గా మారిపోయారు . వైవాహిక జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళుతున్నారు. అయితే రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఒక టాప్ సీక్రేట్ బయటపడి సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . సమంతతో జరిగిన ఇష్యూ కారణంగా నాగచైతన్య - శోభిత దగ్గర స్పెషల్ అగ్రిమెంట్ రాయించుకున్నారట నాగార్జున . సమంత - నాగచైతన్య అసలు విడిపోతారని ఎవరు అనుకోలేదు. వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయారు .
ఆ టైంలో కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఎదుర్కొన్నారట . ఇద్దరు కలిసి కొన్న ప్రాపర్టీస్ అదే విధంగా మరికొన్ని సమస్యలు ఫేస్ చేశారట . ఈ క్రమంలోనే ఫ్యూచర్లో శోభిత - నాగచైతన్య విడిపోయిన సరే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పక్కాగా లీగల్ గా అగ్రిమెంట్ చేయించి ఎవరికి ఎంత రావాలి అనేది ముందుగానే లెక్కలు సెట్ చేశారట . ఒకవేళ ఫ్యూచర్లో నాగచైతన్య -శోభిత ధూళిపాల విడిపోయిన శోభిత ధూళిపాళ్లకి - అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీలో ఒక్క రూపాయి కూడా వెళ్లదు . ఆ విధంగానే నాగార్జున అగ్రిమెంట్ రాయించారట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇదేం కొత్త అగ్రిమెంట్ రా బాబోయ్.. ఎవరైనా కలిసి ఉండాలని కోరుకుంటారు ఇలా విడిపోతారని ముందుగానే ప్లాన్ చేస్తారా ..? అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు..!