ఇక సినిమా రిలీజ్ కాబోతుండగా అనేక రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రియల్ మత్స్యకారుడి కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో మంచి హైప్ ఉంది. అంత బానే ఉన్నా.. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఓ అప్డేట్ ఇపుడు హాట్ టాపిక్ అవుతోంది. చైతు, సాయి పల్లవి ఇద్దరు క్లైమాక్స్ లో చనిపోతారంటూ ఓ వార్త హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. ఇది నిజమా లేక సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసేందుకు ఆకతాయిలు క్రియేట్ చేసిన గాసిప్ ఏమో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో.. ఆడియన్స్లో ఒకింత ఆసక్తి నెలకొంది. హీరో, హీరోయిన్ ఇద్దరు చివరిలో చనిపోతే సినిమా ఎలా ఉంటుందో? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా క్లైమాక్స్లో నిజంగానే వీరిద్దరూ చనిపోతారా లేదా అనేది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే!
ఇకపోతే, నాగ చైతన్యకు ఉన్న మార్కెట్ రిత్యా.. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ భారీగానే పెట్టడం జరిగింది. కానీ.. సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్తో పాటు బన్నీ వాసు ఈ సినిమా కోసం చాలా భారీగా ఖర్చు చేశారు. ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో అని కొంతమందికి లోలోపల భయం ఉండనే ఉంది. అయితే ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాతో చైతు భారీ సక్సెస్ సాధిస్తాడని అభిమానులు అయితే గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాపై టీం మొత్తం.. ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు.