- భారీ బ‌డ్జెట్ తో మైత్రీ బ్యాన‌ర్లో ఫౌజీ నిర్మాణం
- ప్ర‌భాస్ కు జోడీగా ఇమాన్వీ

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ ది రాజా సాబ్ ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండ‌గా ఈ సినిమా ను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది. ఇక ఈ సినిమా తో పాటు ప్ర‌భాస్ నటిస్తున్న పీరియాడిక్ వార్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ ఫౌజీ ’ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ న‌డుస్తోంది.


ఇక ఫౌజీ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో కనిపిస్తాడని స‌మాచారం. ఇక ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ పీరియాడిక‌ల్ ప్రాజెక్టు పై అంచ‌నాలు అయితే స్కై రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా రిలీజ్ విష‌యం లో మేక‌ర్స్ ఓ సాలిడ్ స్ట్రాటెజీ ప్ర‌కారం వెళుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా ను 2025 చివరి నాటికి ఈ మూవీ షూటింగ్ ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని.. 2026 సమ్మర్‌లో ఫౌజీ సినిమా ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.


ఇక ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా పూర్తి చేసేందుకు కావాల్సిన ప్రొడక్షన్‌ను ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా నిర్మాతలు అందించనున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఫౌజీ సినిమా ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఫౌజీ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ మూవీ రిలీజ్‌పై మేకర్స్ స్ట్రాటెజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: