టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని సక్సెస్ అవుతుంటే మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య కొత్త ప్రయోగం చేశాడు. తండెల్ అనే కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్కినేని నాగచైతన్య. శోభిత తో పెళ్లి అయిన తర్వాత... అక్కినేని నాగచైతన్య... ఈ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు.


ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా చేయగా సాయి పల్లవి హీరోయిన్ గా చేయడం జరిగింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ పనిచేశారు. బన్నీ వాసు అలాగే అల్లు అరవింద్ నిర్మాతలుగా ఉన్నారు.   ఈ తండేల్ సినిమా సముద్రం అలాగే పాకిస్తాన్ ఇండియా బ్యాగ్రౌండ్  లో వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నో అంచనాల మధ్య ఇవాళ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది.


సినిమా రిలీజ్ కాగానే... అందరూ బాగుందని చెబుతున్నారు. దీంతో సినిమా చూసేందుకు జనాలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ప్రాణం పోసినట్లు తెలుస్తోంది. అతని మ్యూజిక్ కారణంగా సినిమాకు మంచి ప్లేస్ అయిందని.. సినిమా చూసినవారు చెబుతున్నారు. ప్రేమ కథ చిత్రాలకు దేవిశ్రీప్రసాద్... మంచి మ్యూజిక్ అందిస్తారు. ఇక ఈ సినిమాలో కూడా... బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మ్యూజిక్ కూడా దుమ్ము లేపాడు.


ఒక్కో మాట గూస్ బంప్స్ రావాల్సిందే. బుజ్జి తల్లి ఇలాంటి పాటలకు మంచి మ్యూజిక్ అందించాడట దేవిశ్రీప్రసాద్. అటు ఈ సినిమాలో హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి అద్భుతంగా నటించినట్లు చెబుతున్నారు.  ఈ సినిమాకు దర్శకుడుగా ఉన్న చందు కూడా అద్భుతంగా సీన్లు చిత్రీకరించారట. ఓవరాల్ గా నాగచైతన్య నటించిన తండేల్ సినిమాపై పాజిటివ్ టాక్ బయటకు వచ్చేసింది. దీంతో కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని పైన చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: