టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య, లేడి పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటిరోజు పూర్తి అవ్వకముందే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎంతగానో ప్రేమించుకున్న ఒక జంట ఎడబాటుకు గురి అయితే పడే బాధను, ప్రేమను ప్రతిబింబిస్తుంది. సినిమా బాగుంది.. ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యచ్చు అంటూ ఆడియన్స్ కామెంట్స్ లో పెడుతున్నారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి చాలా బాగా నటించారు. వారిద్దరి పాత్రలు, నటన చాలా సహజంగా ఉంది అంట. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనతో పాటు DSP అందించిన అద్బుతమైన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్ గా మారింది.
ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కింది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు.
అయితే ఇదిలా ఉండగా..  తండేల్ మూవీ నార్త్ ఇండియా లో అల్లు అర్జున్ నటించిన పుష్ప, ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమాల టికెట్ ధరలను బీట్ చేసింది. ఈ సినిమా టికెట్ ధర రూ. 200 ఉంది. దీంతో నెటిజన్స్ కల్కి, దేవర, పుష్ప సినిమాలకు కూడా టికెట్ ధరలు ఇంత లేవు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి మరి. ఈ సినిమాపై మొదటి నుండే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉండే.. ఇక ఇప్పుడు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: