రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'SSMB29'. ఈ సినిమా ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్‌లో సాగనుంది. ఇది మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా చెప్పుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తన తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సగటు ప్రేక్షకుడి ఊహకు అందని ట్విస్టులు, మలుపులు, అడ్వంచర్ ఎలిమెంట్స్ మరింత అలరించనున్నాయి. ఈ చిత్రంపై అంచనాలు ఎంతో భారీగా పెరిగిపోయాయి.ఇది ఇలా ఉండగానే తెరపైకి మరో అంశం వచ్చింది.రాజమౌళి, మహేష్ ల ప్రాజెక్ట్ 2027 లేదా 2028లో థియేటర్ లలో వచ్చే అవకాశముంది.అడవుల్లో సాగే సాహస ప్రపంచ యాత్ర నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ కథను పూర్తిగా ఒకే పార్టులో రాజమౌళి చూపించగలడా అనే కొత్త చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఈ కథను మూడు భాగాలుగా రాజమౌళి తీర్చిదిద్దనున్నాడని పలు కథనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మొదటి భాగం పూర్తి కాగానే రెండవ భాగం షూట్ చేస్తారా అనేది కొత్త ప్రశ్నగా మారింది.

వెంటనే మహేష్ డేట్లు ఇస్తాడా? వెకేషన్ పరిస్థితి ఏంటి? ప్రభాస్ తన 5 ఏళ్ల పీక్ కెరీర్ ని రాజమౌళి కి సమర్పించుకున్నట్లు మహేష్ సమర్పించుకుంటాడా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎంతో నిజం ఉందొ తెలీదు కాని రాజమౌళి విజన్ ని సంశయించలేము. దీంతో మహేష్ అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇదిలా ఉండగా రాజమౌళి 'SSMB 29' కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులతో చిత్రబృందం నాన్‌-డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్‌ చేయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు కాకుండా చిత్ర బృందం భారీగా ప్లాన్ చేసింది. ఈ సినిమాని దుర్గ బ్యానర్ పై KL నారాయణ నిర్మిస్తున్నారు.ఇక రాజమౌళి ఏ ప్రాజెక్ట్‌కైనా తన ప్లానింగ్ పరంగా కచ్చితమైన రూట్‌లోనే ముందుకెళతారు. కానీ, ఈ సినిమా మల్టీపార్ట్ ప్రాజెక్ట్ అవుతుందా? లేక సింగిల్ పార్ట్‌గా అనుకున్న విధంగా రాబోతుందా? అన్నది అధికారిక క్లారిటీ వచ్చేంత వరకు ఉత్కంఠ కొనసాగేలా ఉంది.ఇదిలావుండగా ఇటీవల SSMB29 గురించి కొత్త టాక్ ఒకటి బయటకి వచ్చింది. మహేష్ బాబుతో జోడీగా ప్రియాంక చోప్రా కనిపిస్తారని అంతా అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటించనున్నారని మూవీ యూనిట్ ముందే హిట్ ఇచ్చినా, ఇప్పుడు ఆయన స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం తీసుకోవచ్చని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికి ఈ విషయాలనింటికి త్వరలోనే ఎండ్ కార్డు పడనునట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: