టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య, లేడి పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా మొదటిరోజు పూర్తి అవ్వకముందే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎంతగానో ప్రేమించుకున్న ఒక జంట ఎడబాటుకు గురి అయితే పడే బాధను, ప్రేమను ప్రతిబింబిస్తుంది. సినిమా బాగుంది.. ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యచ్చు అంటూ ఆడియన్స్ కామెంట్స్ లో పెడుతున్నారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి చాలా బాగా నటించారు. వారిద్దరి పాత్రలు, నటన చాలా సహజంగా ఉంది అంట. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనతో పాటు DSP అందించిన అద్బుతమైన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్ గా మారింది.
ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కింది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు.
అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి హిట్ అందుకుంది. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. 'సినిమాను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా హిట్ కొట్టడంతో సోషల్ మీడియాలో నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. నేను మిస్ అయింది మళ్లీ తెరిగి వచ్చింది. నేను ఇంత పాజిటివిటీ చూసి ఎంతో కాలం అయ్యింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: