తమిళ స్టార్‌ హీరో కార్తీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా... కార్తీ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమాతో లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియాలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. కాగా, ఖైదీ సినిమా గురించి చిత్ర బృందం తాజాగా అనౌన్స్ చేశారు.


కానీ విక్రమ్... లియో చిత్రాలతో కనగరాజ్ పెను సంచలనంగా మారిపోయాడు. వాటిని కంటిన్యూగా ఎల్సియుని మరిన్ని సినిమాలు ఉంటాయని ప్రకటించడంతో దీంతో కార్తీతో ఖైదీ-2 సినిమా ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. ఖైదీ సినిమా 2018లో విడుదల అయింది. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎల్సీయూలో నిర్మించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.


ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న ఖైదీ-2 ను తెరకెక్కించే పనిలో లోకేష్ కనగరాజ్ ఉన్నారు. కాగా, త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ కీలకపాత్రలో నటిస్తారని సమాచారాలు అందుతున్నాయి. త్వరలోనే ఈ విషయం పైన అధికారిక ప్రకటన వెలువడుతోంది. లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్లో 2022లో రిలీజ్ అయిన విక్రమ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఖైదీ సినిమా కూడా ఉండబోతోంది. కాగా, ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరి ఖైదీ- 2 సినిమా ఏ మేరకు దీక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఖైదీ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఖైదీ-2 సినిమా పై ప్రేక్షకుల లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: