అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వచ్చాయి .. ఇక ఇద్దరి కాంబోలో నాలుగో సినిమా రాబోతున్నట్టు అర్థమైంది .. నేడో రేపు పూజా కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి .. అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది ? ఏ జోనర్లో మూవీ రాబోతుంది ? పుష్పా క్రేజ్ దిగ్గిపోయేలా అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ ఏం స్కెచ్ వేస్తున్నారు .. ? ఇక అల్లు అర్జున్ కు పుష్ప క్రేజ్ ఇప్పట్లో తగ్గటం కష్టమే ఎందుకంటే ఐదేళ్లు ఆ క్యారెక్టర్ తో జీవించేశాడు  బన్నీ .. అంత త్వరగా ఆ మత్తు వదలదు త్వరలోనే ఈయన త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ కాబోతున్నాడు .


ఇక బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటివరకు ఫ్యామిలీ సినిమాలే వచ్చాయి .. కానీ ఈసారి అంతకుమించి అంటున్నాడు త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కోసం మొదటిసారిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు గురూజీ. ఇక ఈ కాంబోలో మైథలాజికల్ సినిమా రాబోతుందనే వార్తలు వస్తున్నాయి .. ముందు నుంచి పురాణాలపై గురూజీకి పట్టు ఎక్కువ .  కుమారస్వామి నేపథ్యంతో త్రివిక్రమ్ కథ‌ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది .. యుద్ధానికి ఆధ్యుడి గా కార్తికేయున్ని కొలుస్తారు .. ఆయన్ని స్కందా అని కూడా పిలుస్తారు .


టాలీవుడ్ కు అసలు సిసలైన మైథలాజికల్ సినిమా వచ్చి చాలా కాలం అయింది .. అందుకే ఈ తరహా కాన్సెప్ట్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు .. హారిక హాసిని క్రియేషన్స్ - గీత ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను 400 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించబోతున్నాయి . వచ్చే సమ్మర్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది .. ప్రెసెంట్ ఈ సినిమా కోసం తన మేకోవర్ను మార్చుకుంటున్నాడు అల్లు అర్జున్ .. అని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కాయమంటున్నారు సిని విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: