అక్కినేని నాగచైతన్య మొదటిసారి జోష్ సినిమా ద్వారా తన సినీ కెరియర్ ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏంమాయ చేసావే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాగచైతన్య ఇందులో నటించిన సమంతని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అలా నాలుగేళ్లకే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవలసి వచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఒక వార్తలు నిరంతరం వినిపిస్తూ ఉంటాయి. విడాకుల అనంతరం సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. అలా నెమ్మదిగా కూడా సినిమాలను తగ్గిస్తూ వస్తోంది సమంత.


రెండో పెళ్లి పైన మాత్రం అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుంది సమంత. కానీ నాగచైతన్య మాత్రం మరొక హీరోయిన్ శోభితని ప్రేమించి వివాహం చేసుకున్నారు. దీంతో సమంతతో విడిపోవడానికి ముఖ్య కారణం శోభితతో డేటింగ్ లో ఉన్నారనే వార్తలు రావడంతో పాటుగా వివాహం కూడా జరగడంతో..  శోభిత పైన సమంత ఫ్యాన్స్ కూడా కొంతమేరకు నెగిటివిటీ కూడా సృష్టించారు. తాజాగా అన్నిటికీ సైతం నాగచైతన్య చెక్ పెడుతూ తాను సమంతతో విడాకులు తీసుకోవడానికి శోభిత అన్న వార్తలు విన్న తర్వాత తను చాలా బాధపడ్డాను అని తెలిపారు. ఈ నింద ఆమెకు పడాల్సింది కాదు అంటూ తెలిపారు..


శోభిత తన జీవితంలోకి ఇన్స్టా చాట్ల చాలా సాధారణంగా అందంగా వచ్చిందని తెలిపారు. మొదట మా మధ్య కేవలం స్నేహం మాత్రమే మొదలయ్యిందని ఆ తర్వాత అది రిలేషన్ గా మారిపోయిందని తెలియజేశారు నాగచైతన్య. మొత్తానికి సమంతతో విడిపోవడానికి కారణం శోభిత కాదనే విషయాన్ని తెలిపారు. ఇటీవలే నాగచైతన్య తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకి అటు సాయి పల్లవి నటనకు చైతన్య నటనకు మంచి మార్కులే పడ్డాయి కలెక్షన్స్ విషయంలో కూడా మొదటి రోజు 21 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: