రష్మిక మందన్నా.ఈ పేరు చెప్తే కుర్రాళ్లకు తెలియకుండానే ఆటోమేటిక్ గా పెదలా పై స్మైల్ వచ్చేస్తూ ఉంటాయి. రీజన్ ఏంటో తెలియదు కానీ రష్మిక మందన్నా ఇప్పుడు కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది . ఏ పాత్రకు తగ్గట్టు ఆ పాత్రలో లీనం అయిపోయి నటించడమే అందుకు కారణం అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా పుష్ప2  సినిమా తీసిన తర్వాత ప్రతి ఒక్కడు శ్రీ వల్లి లాంటి భార్య కావాలి అంటూ కోరుకుంటున్నారు. శ్రీవల్లి పాత్రలో అంత ఆప్ట్ గా సెట్ అయిపోయింది .


మరీ ముఖ్యంగా జాతర ఎపిసోడ్ తర్వాత వచ్చే సీన్ లో చెప్పిన డైలాగ్స్ కేక..కెవ్వు కేక. ప్రతి ఒక్క వైఫ్ కి ఆ  డైలాగ్ లు బాగా సెట్ అవుతాయి . కాగా రష్మిక మందన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే ఇంకా ఆమె కోరిక తీర్చుకోలేదు అన్న వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . రష్మిక మందన్నా.. మెగా ఫ్యామిలీ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటుందట . కానీ ఇప్పటి వరకు ఆమె ఒక్క మెగా హీరోతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేదు.



మెగాస్టార్ చిరంజీవి ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో ఆమె  స్క్రీన్ షేర్  చేసుకోవడానికి వెయిట్ చేస్తుందట. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. సుకుమార్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కే సినిమాలో రష్మిక హీరోయిన్ గా అనుకున్నారు . కానీ బ్యాక్ టు బ్యాక్ సుకుమార్ - రష్మిక నే డైరెక్ట్ చేస్తే ఏం బాగుంటుంది అంటూ ఆ సినిమా ఆఫర్ ఆమె నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అప్పట్లో రష్మిక కోరిక నెరవేరేటట్టే కనిపించట్లేదు సిచువేషన్ చూస్తుంటే అంటున్నారు జనాలు. చూద్దాం ఆ దేవుడు రష్మిక కోరిక ఎప్పుడు నెరవేరుస్తాడో..??

మరింత సమాచారం తెలుసుకోండి: