![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ntrc78e4f05-83d0-4471-8b4f-8f31e5ad90dc-415x250.jpg)
టాలీవుడ్ జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి.. జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఒక్క సినిమా అయినా వస్తే బాగుండు అని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు జనాలు. కాగా వీళ్ళ కాంబోలో సినిమా వచ్చినట్టే వచ్చి చాలా సందర్భాలలో ఆగిపోయాయి . "చింతకాయల రవి" సినిమాలో ఒక సాంగ్ లో జస్ట్ కొన్ని సెకండ్స్ పాటు అలా డాన్స్ వేస్తూ కనిపిస్తారు అంతే తప్పిస్తే .. ఎక్కడ కూడా స్క్రీన్ పూర్తిగా షేర్ చేసుకున్న సందర్భాలు లేవు . అయితే అనుష్క శెట్టి తర్వాత అలాంటి ఒక క్రేజీ క్రేజ్ అందుకున్న హీరోయిన్ మాత్రం సాయి పల్లవి అని చెప్పాలి.
రీసెంట్గా తండేల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ జూనియర్ ఎన్టీఆర్ పక్కన సాయి పల్లవి నటిస్తే బాగుంటుంది అన్న థాట్స్ వచ్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ దశకత్వంలో సాయి పల్లవి నటిస్తే అది కూడా జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటిస్తే ఇక సినిమాకి తిరుగు ఉండదు అని .. ఆ సినిమా చరిత్ర సృష్టిస్తుంది అని పుష్ప2 రికార్డ్స్ ను సునాయాసంగా బద్దలు కొట్టేస్తుందని మాట్లాడుతున్నారు. అయితే ఆల్రెడీ ఈ ప్లేస్ లో రష్మిక మందన్నా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . మరి రష్మిక మందన్నాను తీసేసి సాయి పల్లవిని చూస్ చేసుకుంటాడా అన్నది పెద్ద క్వశచన్ మార్క్ గా మారింది . చూద్దాం ఫ్యాన్స్ సజెషన్ ని ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ ఏ మేరకు తీసుకుంటారు అనేది..???