సాధారణంగా బాలకృష్ణ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ . తొడ కొట్టడాలు .. మీసాలు మెలివేయడాలు ..తొడ కొడితే ట్రైన్ ఆగిపోవడాలు.. మీసం మెలివేస్తే ఎదుట ఉన్న విలన్ షేక్ అయిపోవాలి.. ఒక తొడకొడితే ఎదురుగా ఉన్న సుమోలు పేలిపోవాలి.. ఇలాంటి సీన్స్ మనం ఎక్కువగా నందమూరి హీరో బాలకృష్ణ సినిమాలలోనే చూస్తూ ఉంటాం.  మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి మాస్ సీన్స్ కి పెట్టింది పేరుగా నందమూరి హీరో బాలయ్య పాపులారిటి సంపాదించుకున్నారు . 


బాలయ్యకి స్టార్ ఇమేజ్ వచ్చాక మాస్ సినిమాలు ఎక్కువగా చేశారు . అయితే ఒక దర్శకుడు మాత్రం బాలయ్యకు స్టార్ ఇమేజ్ వచ్చాక ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వే లో ముందుకెళ్ళి సినిమాను తెరకెక్కించాడు . ఆయన మరెవరో కాదు స్టార్ దర్శకుడు కోదండరామిరెడ్డి . ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే బయటపెట్టాడు . "అది బాలయ్య 50వ సినిమా అనుకుంటా ..బాలయ్య కెరియర్ లో అది ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోవాలి అని కోరుకున్నాను . అలాగే జరిగింది . అసలు ఏ ధైర్యంతో బాలయ్య అలాంటి చిత్రం చేసారు అని ఇప్పటికీ ఒక సందేహం ఉంది .



అంతేకాదు నేను యాక్షన్ సినిమాలు చేశాను . ఈసారి బాలయ్యతో కంప్లీట్ గా రొమాంటిక్ కామెడీ చిత్రంగా చేయాలి అనుకున్నాను. ఆ టైంలోనే ఇద్దరు హీరోయిన్స్ గా ఉండే సబ్జెక్టుని చూస్ చేసుకున్నాను. బాలయ్యకు కథ చెప్పగానే ఓకే చేశారు . మేము మెయిన్ గా ఫోకస్ చేసింది పాటలపైనే . అవి చాలా అద్భుతంగా వచ్చాయి. ఫలితంగా ఒక ఫైట్ కూడా లేకపోయినప్పటికీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అంటూ కోదండరామిరెడ్డి చెప్పారు". ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా? శోభన - నిరోషా హీరోయిన్లుగా బాలకృష్ణ హీరోగా నటించిన "నారీ నారీ నడుమ మురారి". ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.  బాలయ్యలోని డిఫరెంట్ యాంగిల్ ను బయటపెట్టింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: