హమ్మయ్య .. ఇన్నాళ్లు అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది వచ్చింది . అయితే ఆ వార్తపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన రాకపోవడం అదంతా ఫేక్ అనుకున్నారు . అంతేకాదు అల్లు అర్జున్ కి అంత సీన్ లేదు.. అంటూ కూడా ట్రోల్ చేశారు . మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ పై ఎలాంటి నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది అనే విషయం అందరికీ తెలుసు. కాగా అల్లు అర్జున్ ఇప్పుడు ఆ వైరల్ అయిన రూమర్ ని నిజం చేయబోతున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.  పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించాలి .


ఈ సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటూ టాక్ వినిపిస్తుంది . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల సెలెక్ట్ అయినట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే పుష్ప2 సినిమా తర్వాత ఆ రేంజ్ లో హిట్ కొట్టాలి అంటే కచ్చితంగా అది పాన్ ఇండియా ఫిలిం అయి ఉండాలి అని.. అందుకే సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో - అల్లు అర్జున్ చేతులు కలిపాడు అంటూ తెగ వార్తలు వినిపించాయి. ఒకానొక టైంలో వీళ్ల సినిమా క్యాన్సిల్ అయిపోయింది అంటూ కూడా మాట్లాడుకున్నారు.



కాగా రీసెంట్ గానే హైదరాబాద్ కి అట్లీ టీం వచ్చింది . అంతే కాదు అల్లు అర్జున్ ని కలిసినట్లు మాట్లాడినట్లు సమాచారం అందుతుంది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . వైరల్ అయిన వార్త నిజం కాబోతుంది అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో మూవీ రాబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు ఈ సినిమా పుష్ప2కి మించిన స్థాయిలో హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . దీనిపై అఫీషియల్ ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు ఫిలిం వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: