బిగ్ బాస్ ఫేమ్ ఆర్ జె శేఖర్ భాషా పై మరో వేధింపుల వ్యవహారం బయటకు వచ్చింది ..రెడ్ స్యాండిల్ యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ , శేఖర్ బాషా తనను మోసం చేశారని బాధ్యతరాలు లక్ష్మీ ఆరోపించింది .. బాధితురాలు లక్ష్మీ తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ .. గతంలో ఓ అబ్బాయి పై ఫిర్యాదు చేయటానికి వెళ్తే ఎస్పీ శ్రీనివాస్ తనను ట్రాప్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది .. తనను మానసికంగా వేధించి తనపై లైంగిక దాడి కూడా చేశారని అంటుంది .. అదేవిధంగా తనను తన ఫ్యామిలీని చంపేస్తానని ఎస్పీ శ్రీనివాస్ బెదిరిస్తున్నారని ఆమె చెప్పుకొస్తుంది.
 

అయితే  ఈ కేసులో శేఖర్ భాషా తన‌కు సహాయం చేస్తానని చెప్పి వేధింపులకు గురి చేశారని బాధితురాలు ఆ మీడియా ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది. .. బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా తనకు ఓ వెంట్లో పరిచయమైనట్లు ఆమె చెప్పుకొచ్చింది .. అలాగే ఆ ఎస్పీపై పెట్టిన కేసును శేఖర్ భాషాకు చెబితే హెల్ప్ చేస్తాని తనను మోసం చేశాడు .. శేఖర్ భాష కూడా నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడు  ..శేఖర్ భాష , ఎస్పీ శ్రీనివాస్ ఇద్దరు చేతులు కలిపి నన్ను హింసిస్తున్నారు అంటూ బాధితురాలు ఆ మీడియా ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేసింది .

ఇక ఇదే క్రమంలో శేఖర్ భాషా వలన గతంలో కూడా ఓ అమ్మాయి చనిపోయిందని కూడా ఆమె చెప్పకు వచ్చింది .. అలాగే ఎస్పీతో ఉన్న కొన్ని ప్రైవేటు వీడియోలను యూట్యూబ్ ఛానల్ లో పెట్టి వేధిస్తున్నట్లు ఆమె చెప్పకు వచ్చింది .. అదే విధంగా ఎస్పీ శ్రీనివాస్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని .. ఎస్వీ శ్రీనివాస్‌ను  సస్పెండ్ చేయాలని బాధిత మహిళా కోరింది .. అలాగే శ్రీనివాస్ భార్యకు ఈ విషయం మొత్తం చెప్పిన కూడా ఆమె కూడా భర్తకు సపోర్ట్ పలుకుతుందని వాపోయింది .. ఎలాగైనా తనుకు న్యాయం కావాలని బాధిత మహిళా డిమాండ్ చేస్తుంది .. కాగా సోషల్ మీడియాలో ఎస్పీ , శేఖర్ బాషకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రజెంట్ వైరల్ గా మారాయి .. శేఖర్ బాషా , ఎస్వి శ్రీనివాస్ త‌న‌ను మోసం చేశారని గతంలో బాధితురాలు అనేకసార్లు పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేసింది .. ఆ పిర్యాదు పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో .. బాధ్యత మహిళ మీడియా ముందుకు వచ్చి తన బాధను వెలగకింది .

మరింత సమాచారం తెలుసుకోండి: