మాటీవీలో ప్రసారమయ్యే కలర్స్ ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా టాలీవుడ్‌కు పరిచయమైన స్వాతి రెడ్డి కలర్స్ ప్రోగ్రాం సూపర్ డూపర్ హిట్ అవడంతో ఒకసారిగా కలర్స్ స్వాతిగా మారిపోయింది. అలాగే ఆమె ఇంటిపేరు పక్కన పెట్టి కలర్స్ స్వాతి అన్న పేరుతోనే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. యాంకర్ గా చేసిన కలర్స్ ప్రోగ్రాం కి ఎంతోమంది స్టార్ హీరోలు వచ్చి వారికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టడంతో ఈ ప్రోగ్రాం సూపర్ డూపర్ హిట్ కావ‌డ‌మే కాదు కలర్స్ స్వాతికి మంచి పేరు కూడా తెచ్చింది. అలా యాంకర్ గా మొదలుపెట్టిన కలర్స్ స్వాతి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా హిట్ సినిమాలలో నటించారు. కలర్స్ స్వాతి తెలుగులో నాని - వెంకటేష్ - నవీన్ చంద్ర - నిఖిల్ - నవదీప్ - అల్లరి నరేష్ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.


ఈమె మొదట కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కలర్స్ స్వాతి అష్టాచమ్మా - ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే - త్రిపుర - స్వామి రారా - కార్తికేయ లాంటి సినిమాలు హిట్టవ‌డంతో ఆమెకు మంచి సినీ కెరీర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా ఆమె పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి కొద్ది రోజులు గుడ్ బై చెప్పింది. పెళ్లైన కొద్ది రోజులకే ఈ హీరోయిన్ తన భర్త నుంచి దూరంగా వచ్చేసిందన్న గుసగుసలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా మంత్ ఆఫ్ మధు సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో స్వాతి రెడ్డి చాలా ఇబ్బందులు పడింది.


ఈమె విడాకులు తీసుకుంది అనే వార్త వైరల్ అవ్వడంతో ఎక్కడికి వెళ్లినా స్వాతిని విడాకులు ప్రశ్న అడిగారు.. దీంతో ఆన్సర్ చెప్పలేక విసిగిపోయింది. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో కలర్స్ స్వాతికి పెళ్లి కాకముందు టాలీవుడ్కు చెందిన కొందరు హీరోలతో లింకు పెట్టి ఎఫైర్ ఉందన్న వార్తలు బాగా ప్రచారం చేశారు. ఇందులో అల్లరి నరేష్ మొదటి వారట. డేంజర్ సినిమాలో చేసినప్పుడే ఈ హీరోయిన్ కి ఎఫైర్ వార్తలు అంటగట్టారట. అంతేకాకుండా నాని - నిఖిల్ - నవీన్ చంద్ర వంటి హీరోలతో ఆమె సినిమాలలో నటించినప్పుడు ఆ హీరోలతో కూడా డేటింగ్ చేస్తుందని వార్తలు రాశారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని ఆమె కొట్టి పడేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: