మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్లపాటు సినిమాలకు గ్యాప్ తీసుకుని ఖైదీ నెంబర్ 150 సినిమాతో వెండితెరపై గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బాగానే ఆడింది .. ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత చిరంజీవి వరుస‌పెట్టి సినిమాలు చేస్తున్న ఒక్క వాల్తేరు వీరయ్య‌ సినిమా మినహా ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. అన్ని సినిమాలు ప్లాపులు అవుతున్నాయి. భోళా శంకర్ - ఆచార్య - సైరా ఇలా ఈ సినిమాలో అన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సోషియో ఫాంటసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే చిరంజీవి ఒకప్పుడు ఇలా వరుస ప్లాపుల తర్వాత హిట్లర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని కం బ్యాక్ అయ్యారు. ఈ క్రమంలోనే హిందీలో సంజయ్ దత్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాను తెలుగులో రీమిక్స్ చేయగలనన్న నిర్ణయానికి వచ్చారు. చిరు ఆ సినిమా రీమేక్‌ లో నటించ‌గా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది.


ఆ తర్వాత స్టాలిన్ వచ్చి యావరేజ్ అయింది. మళ్ళీ శంకర్ దాదా జిందాబాద్ హిందీలో వచ్చిన సినిమా సక్సెస్ అవ్వగా ఆ సినిమాకు సీక్వెల్ మూవీ కూడా చిరు రీమేక్ చేశారు. మొదటి భాగానికి జయంత్‌ దర్శకత్వం వహిస్తే సీక్వెల్ కు మాత్రం ప్రభుదేవా డైరెక్షన్ చేశారు. ఈ సినిమా కామెడీ వరకు మాత్రం ఓకే అనిపించుకున్నా .. ఓవ‌రాల్ గా డిజాస్టర్ అయింది. మొదటి భాగంలో సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ హీరోయిన్ సోనాలి బింద్రే కాగా సీక్వెల్లో మాత్రం కరిష్మా కోటక్ అనే అమ్మాయి నటించింది. ఎంత చిరంజీవి ఏజ్కి తగ్గట్టు ఆమె తీసుకున్న మరి సగం వయసు అయిపోయిన ముదురు అమ్మాయిలా కనిపించింది. పోస్టర్స్ చూస్తేనే మెగా అభిమానులు చిరాకు పడ్డారు. అసలు ఎవరు ఈ అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేసింది అని జనాలు తిట్టుకున్నారు. అలా ఈ సీక్వెల్ ప్లాప్ కావటానికి ప్రధాన కారణం హీరోయిన్ అన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: