ఈ మధ్యకాలంలో అన్ని ఇండస్ట్రీలలో కూడా మిస్టరీ హర్రర్ చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది యంగ్ హీరోలు సీనియర్ హీరోలు కూడా వీటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. తాజాగా హీరో జీవా కూడా గత కొంతకాలంగా ఇలాంటి హర్రర్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల డార్క్ అనే సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకున్నారు. ఇప్పుడు తాజాగా అగత్యా అనే ఒక హారర్ మిస్టరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది.


ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటుగా హీరోయిన్గా రాశి ఖన్నా కూడా నటిస్తోంది. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నది ఫిబ్రవరి 28న ఈ సినిమా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిద్ధమయ్యారు. ట్రైలర్ విషయానికి వస్తే జీవా ఒక భయంకరమైన ప్రదేశంలో ప్రవేశించడంతో మొదలవుతుంది. అయితే ఈ ప్రదేశం మొత్తం కూడా ఎన్నో దశాబ్దాల క్రితం ఆత్మలు నివసిస్తూ ఉన్నట్లుగా చూపించారు. గతంతో పాటుగా వర్తమానాన్ని కలిసిపోయేలా ఈ సినిమా ఉన్నట్టుగా కనిపిస్తోంది.

జీవా కెరియర్ లోనే బెస్ట్ సినిమా అయ్యేలా ఇది కనిపిస్తోంది. ట్రైలర్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే మంచి రెస్పాన్స్ అందుకుంటున్న అగత్యా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కథలు ఆత్మలు మనుషుల మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. కామెడీ ఎంటర్టైన్మెంట్ గా కూడా ఇందులో సన్నివేశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా పూర్తి మిస్టీరియస్ గా కనిపించేలా ఉన్నారు. డైరెక్టర్ విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మరి ఫిబ్రవరి 28న రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి ప్రస్తుతం ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ తో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: