గత కొన్ని నెలల నుంచి సినీ ఇండస్ట్రీలో మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదం రోజురోజుకి ముదురుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. కారణాలు ఏవైనా మాత్రం ఈ ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య మాత్రం విభేదాలు తలెత్యాయని చాలా క్లియర్ గా కనబడుతోంది. ఇటీవలే ఇరువురు కుటుంబ సభ్యులు కూడా మాటలతో కొంతమేరకు ఈ విషయాలకు బీజం వేసినప్పటికీ మరికొన్ని కారణాల చేత అవి నిజమనేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని హీరో రామ్ చరణ్ అన్ ఫాలో చేసినట్లు ఇంస్టాగ్రామ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


గతంలో సాయి ధరంతేజ్ కూడా అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడంతో చాలామంది ఫైరయ్యారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే దారిలో వెళ్ళినట్లు కనిపిస్తోంది.కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత అల్లు కుటుంబం మెగా కుటుంబాల మధ్య ఒక కోల్డ్ వార్ మొదలైనట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అప్పటినుంచి అల్లు అర్జున్ ని సైతం మెగా అభిమానులే కాకుండా మెగా హీరోలు కూడా దూరం పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది.


అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా మెగా కుటుంబం నుంచి కేవలం నాగబాబు చిరంజీవి మాత్రమే వెళ్లి పరామర్శించారు రామ్ చరణ్ కానీ సాయి ధరంతేజ్ గాని మిగిలిన హీరోలు ఎవరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లలేదు. అలా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చాయని వినిపిస్తున్నాయి. ఇక అప్పుడప్పుడు చిరంజీవి తన మేనల్లుడు అల్లు అర్జున్ పైన పలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కానీ.. తమ మధ్య విభేదాలు లేవనే విషయం పైన మాట్లాడలేదు. అల్లు అరవింద్ కూడా అంతే ఇటీవలే మేనల్లుడు విషయంలో తక్కువ చేసి మాట్లాడాలని విషయం మెగా అభిమానులకు నచ్చకపోవడంతో వారందరికీ కూడా సారీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: