ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న‌.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి బాక్సాఫీస్ ల‌ను  ఏలుతున్నారు అన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. ఈ హీరోయిన్లకు  వ‌స్తున్న‌ అవకాశాలు .. అందుకుంటున్న విజయాలు చూస్తుంటే.. వీళ్ళ క్రేజ్‌ ఏంటో అర్థమవుతుంది ఇద్దరు హీరోయిన్లుగా సూపర్ బిజీగా ఉన్నారు .. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను సినిమాలు చేస్తున్నారు .. అప్పుడప్పుడు కోలీవుడ్ లో కూడా మెరుస్తున్నారు .. ఇక మరి ఇప్పుడు ఈ ఇద్దరిలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు ? అనేది చెప్పడం ఎంతో కష్టమే. అయితే ఈ లిస్టులో సాయి పల్లవి కంటే రష్మిక కాస్త మెరుగైన ప్లేస్ లో కనిపిస్తుంది .. యానిమల్ , పుష్ప సినిమాలతో రష్మిక పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు క్రియేట్ చేసింది.


ఇక రెండు భారీ విజయాలను తన ఖాతాలు వేసుకుని వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించింది .. అదేవిధంగా ఈ సినిమాలతో కూడా రష్మిక భారీగానే రెమ్యూన‌రేషన్ అందుకుంది .. బాలీవుడ్ స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంది .. గొప్ప నటిగా విమర్శకుల ప్రశంసలు కూడా తెచ్చుకుంది. ఇలా రష్మిక కెరియర్ ఎలాంటి వడిదలు లేకుండా వెళ్ళిపోతుంది .. ఇదే క్రమంలో సాయి పల్లవిని తక్కువ చూడలేం .. తనకు వచ్చిన ఎన్నో అవకాశాలని కాదనుకొని సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తుంది .. రష్మికలా గ్లామర్ గేట్లు ఓపెన్ చేస్తే అవకాశాలు పరంగా రష్మికనే దాటిపోతుంది .. ఇందులో ఎలాంటి సందేహం లేదు .. కానీ తనకు అంటూ కొన్ని పరిమితులు పెట్టుకుని ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతుంది ..


అయినా కూడా గొప్ప గొప్ప అవకాశాలు సాయి పల్లవి దగ్గరకు వస్తున్నాయి. రీసెంట్ గానే తండేల్ సినిమాతో మరో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంది .. అలాగే బాలీవుడ్ డెబ్యు ఏకంగా రామాయణం సినిమాతో అక్కడ అడుగుపెడటం మరో గొప్ప విషయం .. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న అందరి హీరోయిన్లను పక్కనపెట్టి మరి సీత క్యారెక్టర్ కు సాయి పల్లవి అని ఎంపిక చేసుకున్నారు .. ఇక ఈ సినిమాలో రణ‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు .  బాలీవుడ్ లో సాయి పల్లవి ప్రయత్నించకుండానే గొప్ప అవకాశం వచ్చింది .. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి ఉత్తరాదిని కూడా క్రేజ్ అందుకుంటుందని సిని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: