![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie-56ace89c-d0d1-458c-8114-15a5d36fd1f1-415x250.jpg)
అయితే, ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా తెరపైకి రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో జూలాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి హిట్ సినిమాలను అందించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో నాలుగో సినిమా త్వరలో తెరకెక్కనున్నట్లు.. అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. శివుడి కుమారుడు కార్తీకేయుడిగా హీరో బన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా గాడ్ ఆఫ్ వార్ గా కార్తికేయుని ప్రయాణం ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
ఎంతో ఫ్యాన్ బేస్ ఉన్న బన్నీని సోషల్ మీడియా వేదిక అయిన ఇన్ స్టాగ్రామ్ లో 28.5 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న తొలి దక్షిణ నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు. కానీ బన్నీ మాత్రం ఇన్ స్టాలో ఒక్కరినీ మాత్రమే ఫాలో అవుతున్నారు. ఆ ఒక్కరూ ఎవరు అని ఆలోచిస్తున్నారా.. తన భార్య స్నేహ రెడ్డి. అల్లు అర్జున్ కేవలం స్నేహరెడ్డి మాత్రమే ఫాలో అవుతున్నారు.