టాలీవుడ్ మంచు మనోజ్ కొడుకు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. మహా భారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వ వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్‌ తో పాటు, అక్షయ్ కుమార్, శరత్ బాబు లాంటి స్టార్లు కూడా భాగమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25 న ప్రేక్షకుల ముందుకి రానుంది.
అయితే ఇందులో ప్రభాస్ శివుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అయితే అంచనాలకు మించి ఈ సినిమాను తెరకెక్కిస్తామని కన్నప్ప టీమ్ చెప్తుంది. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ సినిమా వాయిదా పడి వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. కనప్ప సినిమాలో మోహన్ లాల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే ఇప్పటికే కన్నప్ప సినిమాలో ప్రభాస్ లుక్ ని కూడా విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్ర పోషించనున్నారు.
ఆ పాత్రకి ప్రభాస్, మోహన్ లాల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణుని అడిగాడు. దానికి ఆయన మాట్లాడుతూ.. 'ఈ సినిమా కోసం వాళ్లు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మా నాన్నగారు మోహన్ బాబుపై ఉన్న గౌరవంతోనే ఇద్దరు ఎంతో ఆసక్తిగా సినిమాలో నటించారు' అని చెప్పుకొచ్చాడు. వారిద్దరూ చాలా వినయంగా ఉంటారని మంచు విష్ణు చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: