![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/nagarjuna-konda-surekha-nampally-court71d96492-b590-48ff-82fc-5f6be6a0b858-415x250.jpg)
గతంలో ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల అక్కినేని కుటుంబం మానసికంగా గాయపరిచారని ఆ వ్యాఖ్యలు సామాజిక మధ్యమాలలో చేసిన పోస్టుల వల్ల మరింత చర్చనీయాంశంగా మారింది అంటూ కూడా వాదనలో తెలిపారట. అయితే సురేఖ చేసిన వ్యాఖ్యలు కేవలం తమ అభిప్రాయమే అంటూ ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదంటూ ఆమె తరపున న్యాయవాది సైతం తెలియజేశారట. ఈ కేసు విభాగం అక్కినేని కుటుంబం మరియు సినీ వర్గాలలో కూడా చాలా ఉత్కంఠతను కలిగించేలా చేస్తోంది.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. దీంతో ఆమె సోషల్ మీడియాలో క్షమాపణలు కూడా కోరింది ఈ వాక్యాలకు సైతం అక్కినేని కుటుంబం తీవ్రంగా ఫైర్ అయ్యి పరువు నష్టధావ కూడా వేశారు. సురేఖ తరఫున న్యాయవాది గురుప్రీత్సింగ్ ఇదివరకే ఈ వివాదం పైన ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వాదిస్తున్నారని ఆమె ఎవరిని వ్యక్తిగతంగా కూడా కించపరచలేదు అంటూ కేవలం సామాజిక పరిస్థితులు అభిప్రాయాన్ని మాత్రమే తెలిపిందంటూ కోర్టుకు వెల్లడించారట. ఈ కేసు కొట్టి వేయాలంటూ మంత్రి కొండా సురేఖ తరఫున న్యాయవాది అభ్యర్థించగా.. మరి కోర్టు ఇరువురి వాదనలు విన్న తర్వాత ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.