![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-sai-pallavib3539446-4fcc-452d-9173-5da27de68a30-415x250.jpg)
పలువురు స్టార్ హీరోస్ అయితే ఆమె కోసం కాల్ షీట్స్ కూడా ఫిల్ చేసుకోకుండా పక్కన పెట్టేసారట . అలాంటి ఒక క్రేజీ స్థానాన్ని సంపాదించుకుంది ఇండస్ట్రీలో మహానటి సావిత్రి. ఆ తర్వాత అలాంటి స్థానం సంపాదించుకున్న హీరోయిన్స్ మాత్రం సౌందర్య , శ్రీదేవి అని చెప్పాలి. ఆ తరువాత అలాంటి హీరోయిన్ ఇండస్ట్రీలోకి రాదు..రాబోదు అంటూ జనాలు మాట్లాడుకున్నారు. కానీ వచ్చింది. సావిత్రి-సౌందర్య-శ్రీదేవిల ని మించిపోయే టాలెంట్..ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చేసింది.
ఆమె మరెవరో కాదు "సాయి పల్లవి". ఇప్పుడు అలాంటి ఒక స్థానం సంపాదించుకుంది హీరోయిన్ సాయి పల్లవి . ఎస్ హీరోయిన్ సాయి పల్లవి తో నటించడానికి ఇప్పుడు స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ కూడా సాయి పల్లవితో నటించాలి అంటూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఆల్రెడీ ఆమె రన్బీర్ కపూర్ తో రామాయణం సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . అంతేకాదు మరొక బిగ్ ఆఫర్ కూడా ఆమె ఖాతాలో వచ్చి చేరింది అని త్వరలోనే అఫిషియల్ ప్రకటన వస్తుంది . ఇలా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ డేట్స్ కోసం హీరోస్ ఇంతలా వెయిట్ చేయడం చాలా రేర్గా చూస్తూ ఉంటాము అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . రీసెంట్గా సాయి పల్లవి "తండేల్" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమాలో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చెప్పిన డైలాగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి..!